పథకాలతో అత్యుత్తమ ఫలితాలు రావాలి

ఆంధ్రప్రదేశ్

మహిళా శిశు సంక్షేమ పథకాలపై సవిూక్ష
మరింత పకడ్బందీగా అమలుకు సిఎం బాబు ఆదేశం
సృజనక్రాంతి/అమరావతి : పథకాలు అందించడమే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సవిూక్ష చేశారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సవిూక్షించారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశు మరణాలు, మిషన్‌ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్‌ ప్రొటెక్షన్‌ కార్యక్రమాలపై అధికారులతో సీఎం సవిూక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సవిూక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని?అందులో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 48770 ఉండగా, మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తి అయ్యాయిని, మరో 2800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే గత ఐదు ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దఅష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని అధికారులు వివరించారు. అంగన్వాడీల అప్‌ గ్రెడేషన్లో కూడా పురోగతి లేదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు అని, 8,455 సెంటర్లలో విద్యుత్తు సదుపాయం లేదని సీఎంకు అధికారులు సవిూక్షలో వివరించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్‌ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని?వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *