ఆంధ్రప్రదేశ్

తప్పు చేసినవారిని ఉపేక్షించం- సీఎం చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. ఈ…

‘అగధ’ మూవీ పబ్లిసిటీ జాతర

హైదరాబాద్ నగరానికే కాదు… యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న చారిత్రక, ఆధ్యాత్మిక మహా పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ దేవాలయం. శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయం ప్రతి ఏడాది బోనాల సందర్భంగా లక్షలాది మంది భక్తులతో కళకళలాడుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవార్ల ఆశీస్సులు పొందుతుంటారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సైతం […]

కోదాడలో మాంగళ్యషాపింగ్ మాల్ 33వ శాఖ గొప్ప ప్రారంభం

మాల్ ప్రారంభించిన సినీ హీరోయిన్ ఆషిక రంగనాథ్ సృజనక్రాంతి/కోదాడ: 2012లో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రారంభమైన మాంగళ్యషాపింగ్ మాల్, వస్త్ర వ్యాపార రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ వేగంగా విస్తరిస్తోంది. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల ఆదరణను పొందిన మాంగళ్య, ఇప్పటికే తెలంగాణ, ఆంద్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో తన ఉనికిని చాటింది. ఈ క్రమంలో కోదాడలో 33వ శాఖను బుధవారం గొప్పగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి ఆషిక రంగనాధ్ […]

నవలా రచనకు మార్గదర్శనం ‘డాబా హోటల్’

శిరంశెట్టి కాంతారావు గారి కలం నుండి వెలువడే రచనలు సమాజానికి కుడియెడమలుగా మారిన దర్పణమై నిలుస్తాయి. సమాజంలోకి ఇంకిపోయి, ఇమిడిపోయి, అన్యుల కలానికి అందని, అన్యులు సులభంగా అందుకోలేని వస్తువును సాహిత్యీకరణ చేయడం శిరంశెట్టి గారి కలం ప్రత్యేకత. ప్రత్యేక పరిశీలనా దృక్పథం వారి విశిష్టత. అందుకే శిరంశెట్టి గారి రచనలకు తెలుగు పాఠక లోకంలో అంతటి సాధికారిత, విలువ. __________________ ఏదేని రచన పాఠకులకు చేరువ కావాలంటే వస్తువు నూతనమైనదై ఉండాలి, లేదా వస్తువును నూతన […]

పెనుగులాట తప్పని జీవితాలే డా. శైలజ కథలు

జీవితం సంక్లిష్టమైంది, వేగవంతమైంది. ఒక కాలాన్ని సరైన సమయంలో నమోదు చేయకపోతే ఇట్టే జారిపోతుంది. గాలి ఆడనప్పుడు ఉక్కపోత తప్పదు. ఎదురుపడిన ప్రతి జీవితంలోనూ ఊపిరిసలపని ఉక్కపోతలే ఉంటాయి. వృత్తి వ్యాపకాల్లో బిజీ అయినప్పటికీ, అభిరుచులు వెంటాడుతూనే ఉంటాయి. అలా అభిరుచుల్ని పండించుకున్న డా. కాళ్ళకూరి శైలజ సాహిత్య జీవితం కథలుగా, కవిత్వంగా, సమీక్షలుగా సాగిపోతూనే ఉంది. నిర్మాణాత్మకమైన ఆలోచనలతో సాహిత్యం పట్ల ఆసక్తి చూపిస్తూ, ఆమె తనదైన శైలిని ఏర్పరచుకున్నారు. ___________________ డా. శైలజ ఈ […]

వర్తమాన కవిత్వంపై నిశితమైన వ్యాఖ్యానం

ఇవాళ కవిత్వం ఎలా ఉంది? ఎలాంటి కవిత్వం వస్తోంది? కవులు ఎలాంటి వస్తువులను స్వీకరిస్తున్నారు? వస్తువును కవిత్వం చేయడంలో వారి సాఫల్య వైఫల్యాలు ఏమిటి? కవిత్వంలో సాంద్రతను సాధించడంలో చేస్తున్న కృషి ఏమిటి? వైవిధ్యమైన అభివ్యక్తి కోసం చేస్తున్న ప్రయత్నాల తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు జవాబులు చెబుతుంది ఏనుగు నరసింహారెడ్డి ‘వ్యక్తావ్యక్తం’. ______________________ డెబ్బైకి పైగా వ్యాసాలున్న ఈ పుస్తకంలో ఆరేడు వ్యాసాలు మినహా మిగతావన్నీ దాదాపు దశాబ్దకాలంగా కవిత్వం రాస్తున్న వారి పుస్తకాలపై […]

నాన్నగుండెలో వెలిగిన అక్షరదీపం “లేఖ్య”

“A daughter is the happy memories of the past, the joyful moments of the present, and the hope and promise of the future” సమకాలీన తెలుగుసాహిత్యంలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించుకున్న యువకవుల్లో మొదటి వరసలో ఉండే యువకవి మెట్టానాగేశ్వరరావు. అద్భుతమైన కవిత్వాన్నయినా, ఆలోచనాత్మక విమర్శనైనా, అంతే వేగంగా రాయగల దిట్ట మన మెట్టా. తన మొదటి కవితాసంపుటి “మనిషొక పద్యం” తోనే పాఠకవిమర్శకుల హృదయం […]

కవిత్వం: ఒక సామాజిక సృజనాత్మక కళ

సమాజాన్ని మేల్కొల్పిన కళలు, ఆలోచింపజేసిన కవిత్వం ఆయా కాలాల్లో జీవం పోసుకున్న అద్భుత సృజనలు. ఒక కవి అన్నట్లు, ‘కష్టాలు, కన్నీళ్లు ఉంటే అది కవిత్వమే’. నిజమే, బతుకును, బతుకు సంవేదనలను సరళంగా, సున్నితంగా, స్పష్టంగా, సాంద్రంగా, లోతైన భావోద్వేగాల సమ్మిళితంగా అభివ్యక్తీకరించేదే కళాత్మక సృజన. ఇంకొంచెం లోతుగా చూస్తే, ‘భావోద్వేగాల అభివ్యక్తి స్వేచ్ఛా ప్రవాహమే కవిత్వం’ అంటారు విలియం వర్డ్స్‌వర్త్ (William Wordsworth). మరికాస్త లోతుగా పరిశీలిస్తే, ఇది శక్తివంతమైన, ఉప్పొంగే భావాల సహజ ప్రవాహం. […]

నికర వాటా జలాల వినియోగానికి కేంద్ర జోక్యం చేసుకోవాలి

తుంగభద్ర నుంచి తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగానికి, భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయ సాధనకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఇప్పుడు అయిదారు టీఎంసీలకు మించి రావడం లేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్‌ కింద జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల్లో 83,987 ఎకరాల […]

కవిత్వంలో వస్తువును ఉదాత్తం చేయడం ఎలా?

కవిత్వంలో ఒక వస్తువును ఉదాత్తం చేయడం అంటే, నిత్యజీవితంలో మనం చూసే ఒక సాదాసీదా వస్తువును, ఒక చిన్న భావాన్ని లేదా ఒక మామూలు సంఘటనను దాని భౌతిక రూపానికి మించి, అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం. ఇది కేవలం ఆ వస్తువు బాహ్య రూపాన్ని వర్ణించడం కాదు; దానికి ఒక లోతైన అర్థాన్ని, ఒక సార్వత్రిక విలువను ఆపాదించడం. ఈ ప్రక్రియ ద్వారా కవి ఒక సాధారణ విషయాన్ని కేవలం కంటికి కనిపించేదిగా కాకుండా, దాని […]

రాయలసీమ కథా సాక్షి: సింగమనేని నారాయణ – జీవితం, సాహిత్యం

రాయలసీమ అనగానే ఒకప్పుడు కరువు, ఫ్యాక్షనిజం, విద్వేషాల ప్రాంతంగానే ప్రధాన స్రవంతి మీడియా లేదా సాహిత్యం చిత్రించింది. కానీ, ఆ ముఠా కక్షల వెనుక ఉన్న అసలైన సామాజిక కారణాలను, కరువు వెనుక దాగున్న పాలకుల నిర్లక్ష్యాన్ని, అన్నింటికీ మించి ఆ మట్టి మనుషుల ఆకలిని, ఆత్మాభిమానాన్ని అత్యంత ప్రామాణికంగా రికార్డు చేసిన అరుదైన రచయిత సింగమనేని నారాయణ. కథకుడిగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారుడిగా ఆయన తెలుగు సాహిత్యానికి చేసిన సేవ అనన్యసామాన్యం. ____________________ రాయలసీమ కథకు […]