హైదరాబాద్‌తో సమంగా వరంగల్ అభివృద్ధి

హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. ఓరుగల్లు గొప్ప చైతన్యం కలిగిన ప్రాంతమని, తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి జిల్లా ప్రజలు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతో కీలకమైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనుల కోసం రూ. 6500 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వరంగల్‌కు విమానాశ్రయం తెచ్చామని, […]

More

ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు

నిలువురాళ్ల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం దీన్ని పర్యాటక, చారిత్రక, పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దుతాం యూనెస్కో శాశ్వత గుర్తింపు కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది దీనికోసం ప్రత్యేక కృషి చేస్తున్న ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ సహకారం ఉంటుంది నిలువురాళ్ల ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమల్ నిలువు రాళ్ల (మెన్హిర్స్) ను సందర్శించిన మంత్రి జూపల్లి ముడుమల్ నిలువు రాళ్లకు యునెస్కో గుర్తింపు కోసం ప్రపంచ వారసత్వ తాత్కాలిక […]

More

ఎస్సి వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది

చట్ట సభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు తీర్మానం -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుప్రింకోర్టు తీర్పుననుసరుంచి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టసభలలో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తేల్చిచెప్పారు. ఎస్సిలకు రిజర్వేషన్లు పెంచాలి అన్న డిమాండ్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందని 2026 […]

More

బలహీన వర్గాల రిజర్వేషన్లు.. పురిటిలోనే గొంతు నొక్కాలని కుట్రలు

బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాలి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పురిటిలోనే గొంతు నొక్కాలని సాగుతున్న కుట్రలను బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణలో పునాది రాయి పడిందని అన్నారు. 17 వ అఖిల భారత పద్మశాలి, 8 వ తెలంగాణ పద్మశాలి సంఘం మహాసభల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. దేశం […]

More

టన్నెల్‌ ప్రమాదం అనుకోని దుర్ఘటన

రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్య పరిష్కరించుకోవాలి పదేండ్ల పాటు ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ పనుల విషయంలో నిర్లక్ష్యం సమస్య కొలిక్కి రావడానికి మరో రెండుమూడు రోజులు పడుతుంది టన్నెల్‌లో ప్రమాదం జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సృజనక్రాంతి/హైదరాబాద్‌ : నాగర్‌ కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు తొమ్మిది రోజులుగా నిర్విరామం గా […]

More

తెలంగాణ ఆడబిడ్డలు పవర్‌ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు

మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నాం మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం వనపర్తి బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి సృజనక్రాంతి/హైదరాబాద్‌ : అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్‌ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. […]

More

రాష్ట్రంలో యూరియా కొరత లేదు

– రైతులు ఆందోళన పడవద్దు- మంత్రి తుమ్మల – వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తుమ్మల – ఈ వారంలో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా – మంత్రి తుమ్మల రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి […]

More

వేగవంతంగా బిటిపిఎస్ పెండింగ్ పనులు పూర్తి చేయించాలి

నిర్థిష్ట గడువులోగా పనుల్లో వేగం పెంచడానికి క్యాలెండర్ ఫిక్స్ చేసి టార్గెట్ విధించాలి సాంకేతిక సమస్యల సత్వర పరిష్కారానికి ఇంజనీర్లతో త్రిసభ్య కమిటి వేగవంతంగా విద్యుత్తు ఉత్పత్తి పుణరుద్దరణకు త్రిసభ్య కమిటి దోహదం భద్రాద్రి పవర్ ప్లాంటులో నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు స్థానికులకు అవకాశం ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ద్వారా నాన్ టెక్నికల్ఉద్యోగుల నియామకం బొగ్గు బూడిదతో ఇటుకలు తయారీకి యువతకు ప్రోత్సహం బిటిపిఎస్ అభివృద్ది పనుల పురోగతిపై డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సమీక్ష భద్రాద్రి […]

More

ఎయిర్ పోర్ట్ నుండి నలభై నిమిషాలలో ఫ్యూచర్ సిటీ కి…

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మొదలై రావిర్యాల మీదుగా గ్రీన్ కారిడార్ మెట్రో రైల్ ఎయిర్ పోర్ట్ మెట్రో కారిడార్ లో మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్ర స్థాయి పరిశీలన హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ల వరుసలో నాలుగో సిటీగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనికత దిశగా అడుగులు పడుతున్నాయి. ఇది కాలుష్యరహిత గ్రీన్ సిటీ గా ప్రపంచంలోనే అద్భుత నగరాల సరసన చేరాలన్నది ఆయన […]

More

సమస్యల పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలి

సమస్యలను పరిష్కరించడంలో సివిల్ సర్వీస్ అధికారులు ప్రజలకు ఉపయోగపడే విధంగా సానుకూల దృక్ఫథం కలిగి ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. పేదలకు సహాయం చేయాలన్న ఆలోచన ఉన్న అధికారులు ప్రజల మనసుల్లో ఎక్కువ కాలం గుర్తుంటారని చెప్పారు.ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం. గోపాలకృష్ణ రాసిన ‘లైఫ్ ఆఫ్ ఏ కర్మ యోగి’ (Life of a Karma Yogi) పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ […]

More