నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. బ్లాక్ బస్టర్ చిత్రాలు స్వామి రారా, కేశవ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఇది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి తమ 32 వ చిత్రంగా దీన్ని రూపొందిస్తోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సీనియర్ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ దీన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
కన్నడ సినీ ఇండస్ట్రీలో మంచి పాపులర్ హీరోయిన్గా అందరినీ అలరిస్తోన్న రుక్మిణి వసంత్ .. ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మరో బ్యూటీ డాల్ దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటిస్తోంది. హర్ష చెముడు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం రిలీజ్ కానుంది.
