మీడియా అధినేత రామోజీరావు కన్నుమూత

వినోదం, జర్నలిజం, వ్యాపార రంగాలలో అత్యంత గౌరవనీయమైన, ప్రభావవంతమైన పేర్లలో ఒకరైన రామోజీరావు శనివారం తెల్లవారుజామున మరణించారు. ఆయన వయసు 87. అధిక రక్తపోటు, శ్వాస ఆడకపోవటంతో జూన్‌ 5న హైదరాబాద్‌లోని స్టార్‌ ఆసుపత్రిలో రావును చేర్చారు. కష్ణా జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీలోని పెదపారుపూడిలో 16 నవంబర్‌ 1936న వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. తల్లిదండ్రులు వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ, వారి తాత గౌరవార్థం అతనికి రామయ్య అని పేరు పెట్టారు. తరువాత అతను దానిని […]

More