ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని గుర్తు తెచ్చే కథలు
మహిళా ఇంజినీర్లు అరుదుగా కనిపించిన కాలంలో, ఏకంగా రహదారులు-భవనాల శాఖలో ఇంజినీరుగా పని చేసి, తన ఆధ్వర్యంలో కిలోమీటర్ల కొద్దీ రోడ్లు వేయించారు పసుమర్తి పద్మజ వాణి. అక్కడితో ఊరుకుంటే ఈమెని గురించి ఎక్కువమందికి తెలియకపోను. ఆ రోడ్డు నిర్మాణ అనుభవాలకి ఇతరత్రా ఆలోచనల్ని జతచేసి కవిత్వంగానూ, కథలుగానూ మలిచారు. ఎప్ప్పుడో 1981 లో మొదలు పెట్టి 2011 వరకూ అప్పుడొకటి ఇప్పుడొకటిగా రాస్తూ వచ్చిన తొమ్మిది కథలని కలిపి మొన్నీమధ్యనే ‘బతుకు రాదారిలో..’ పేరిట కథాసంపుటి […]
More