మూసీ మురికి నుంచి పేదలను కాపాడుతాం

తెలంగాణ

హైదరాబాద్‌ : తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిని వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
మూసీనది అభివృద్ధి ప్రాజెక్టు వివరాలు వెల్లడిరచారు. ‘మూసీ దుర్గంధంలో మగ్గిపోతున్న వారికి మెరుగైన జీవితం ఇవ్వాలని ఈ ప్రాజెక్టు తలపెట్టామని అన్నారు. నగరం మధ్య గుండా నది వెళ్తున్న రాజధాని మరొకటి ఈ దేశంలో లేదు. దాదాపు 300 కి .విూ ప్రవహించే మూసీకి ఎంతో చరిత్ర, విశిష్టత ఉంది. కొందరు మెదడులో మూసీలో ఉన్న మురికికంటే ఎక్కువ విషం నింపుకొన్నారు. మూసీ ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. మల్లన్న సాగర్‌, వేమలఘాట్‌లో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవాలి. రాత్రికి రాత్రే పోలీసులతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి మేం ఖాళీ చేయించటం లేదు. రంగనాయక్‌సాగర్‌, కొండపోచమ్మ.. ఇలా ఎక్కడికైనా నేను వస్తా. నేడు మూసీ నది కాలుష్యానికి ప్రతీకగా మారింది. 1600కు పైగా నివాసాలు పూర్తిగా మూసీ నది గర్భంలో ఉన్నాయి. మల్లన్నసాగర్‌లో మునిగిపోయిన 14 గ్రామాల్లో ఎలా వ్యవహరించారో తెలుసా? మేం ఉన్నపళంగా, నిర్దయగా ఎవరినీ ఖాళీ చేయించలేదు. నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లు కేటాయించి, రూ.25వేలు ఇచ్చాం. చెరువుల్లో అక్రమంగా నిర్మించుకున్న భవనాలనే హైడ్రా కూల్చింది. మూసీ పరివాహకంలో ఎవరి ఇళ్లను హైడ్రా కూల్చలేదు. చినుకు పడితే చాలు హైదరాబాద్‌లో గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. రోడ్లపై పడిన వర్షపు నీరు చెరువుల్లోకి, నదుల్లోకి చేరాలా.. అలాగే రోడ్లపై ఉండాలా?‘ అని సీఎం ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టుకు ఎందుకు చేపట్టారో వివరించారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. మూసీ సుందరీకరణ అంశంపై వివాదం మరింత చెలరేగుతుండటంతో సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం విూడియా ముందుకు వచ్చారు. మూసీ వివాదంపై స్పష్టత ఇచ్చారు.
తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశిరచే ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టిందన్నారు. 33 బృందాలు మూసీ పరివాహకంపై అధ్యయనం చేశాయని సీఎం తెలిపారు. మూసీ పరివాహకంలో నివసిస్తున్న వారు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటి వారికి మెరుగైన జీవితం అందించాలని భావిస్తున్నామన్నారు. విద్యావంతుల నుంచి నిరక్ష్యరాస్యుల వరకు అందరికీ హైదరాబాద్‌ ఉపాధి కల్పించాలన్నారు. గత ప్రధానులు పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని అభివృద్ధి చేశారని.. గత ప్రధానులు సంస్కరణలు తెచ్చిన ప్రతిసారీ కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చిందని సీఎం గుర్తు చేశారు. 10 నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసీపై పనిచేస్తున్నారని సీఎం తెలిపారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారన్నారు. విప్లవాత్మక నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్లు ఎప్పుడూ ఉంటారని అన్నారు. విషవలయంలో పేదలు ఉండాలనేది కొందరి ఆలోచన అంటూ విపక్షాలపై పరోక్షంగా సీఎం రేవంత్‌ విమర్శలు గుప్పించారు. భూగరిష్ట పరిమితి చట్టాన్ని వ్యతిరేకించిన వర్గం కూడా దేశంలో ఉండేదన్నారు. పేదలు ఎప్పుడూ పేదలుగానే ఉండాలని దొరలు, భూస్వాములు భావిస్తారన్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు, అధికారులు రాష్టాన్ని దోచుకున్నారని సీఎం ఆరోపించారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదని.. మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమం అని చెప్పారు. కొందరి మెదడులో మూసీలో ఉన్న మురికి కంటే.. ఎక్కువ విషం నింపుకున్నారంటూ విపక్ష నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విషపూరిత ఆలోచనలతోనే మూసీ ప్రాజెక్ట్‌పై దుష్పచ్రారం చేస్తున్నారన్నారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా సీఎం పేర్కొన్నారు.
‘మూసీ సుందరీకరణ కోసం ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్‌ అనలేదా? అడ్డుకుంటున్న నేతలు 3 నెలలు మూసీ ఒడ్డున జీవించాలి. కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల 3 నెలలు మూసీ ఒడ్డున ఉండాలి. వాళ్లు 3 నెలలు అక్కడ ఉంటామంటే కావాల్సిన వసతులు కూడా కల్పిస్తాం. ఆ ముగ్గురూ మూడు నెలలు అక్కడ ఉంటే.. ఈ ప్రాజెక్టును ఆ పేస్తాం. మూసీ పరివాహకంలోనే ఉండి ప్రజల కోసం పోరాడాలి, వారి జీవితం బాగుందని నిరూపించాలి. మూసీ ప్రజల కోసం ఏం చేద్దామో అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలి. మూసీ పునరుజ్జీవం కోసం విూ వద్ద ఉన్న ప్రణాళిక చెప్పండి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి వచ్చి సూచనలు, సలహాలు ఇవ్వాలి. విపక్ష నేతల సందేహాలు ఏమిటో చెప్పాలి‘ అని సీఎం ప్రశ్నించారు. విూడియా సమావేశంలో సిఎస్‌ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.