మానవీయతకు చిరునామా ఆశారాజు కవిత్వం

‘నిరీక్షించడం నా విధేయత రావడం నీ బాధ్యత జీవితమా మర్చిపోకు కవిత్వం నాకు ఒక నమ్మకం’ అంటూ ‘నా విధేయత’ కవిత ద్వారా స్పష్టంగా తన నిర్ణయాన్ని ప్రకటించడమే కాకుండా తు.చ. తప్పకుండా పాటిస్తున్న మానవీయ కవి ఆశారాజు. ఆయన కవిత్వంలో గంభీరమైన పదజాలాలు కనిపించవు. పొడుగు పొడుగు వాక్యాలుండవు. అనవసరమైన ఉపమానాలుండవు. సందర్భానుసారమైన సుస్వరాల కవితాశైలితో ఆకట్టుకొనే కవితా నిర్మాణం ఆయనది. జీవితం పట్ల అమితమైన ప్రేమను చూపించడం మాత్రమే ఆయనకు తెలిసిన మర్మకళ. సామాన్య […]

More

‘భారతదేశం నా మాతృభూమి’

నిర్ధిష్టమైన ఆలోచనలకు మహత్తరమైన నైతిక విలువలతో కూడిన ఆశయాలను జోడించి వాడుక భాషా పదాలతో అద్వితీయమైన ప్రతిజ్ఞ రచించి భారతదేశ వారసత్వ సంపదగా తరతరాలకు వరంలా ప్రసాదించిన ఘనత ‘పైడిమర్రి వెంకట సుబ్బారావు’ కు చెందుతుంది. నల్గొండకు చెందిన ప్రముఖ రచయిత పరిశోధకుడు ఎలికట్టె శంకరరావు నల్గొండ జిల్లా కథలు పుస్తకం రాస్తున్నప్పుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు మొదటిసారిగా వెలుగులోకి తెచ్చారు. శంకరరావే కనుక పైడిమర్రి పేరును వెలుగులోకి తీసుకురాకపోయి ఉన్నట్లయితే ఈనాటి వరకు ‘ప్రతిజ్ఞ’ […]

More

దేశంలో చట్టసభల గౌరవం తగ్గుతోంది..!

అధ్యక్షతరహా ప్రజాస్వామ్యాన్ని కాదని పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మన (జాతి నిర్మాతలు)దేశం ఎందుకు ఎంచుకుందంటే?.చర్చలు, ప్రశ్నలు, జవాబులతో కార్యనిర్వహక వర్గాన్ని చట్టసభలను జవాబుదారీ చేయాలనే సదుద్దేశం దాగి ఉంది. దీనివల్ల ప్రజా ప్రతినిధుల ద్వారా నిర్మాణాత్మక అధికారం పౌరులందరి చేతుల్లో ఉంచబడుతుంది. ఈమధ్య మన దేశంలోని పహల్గాంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు పాకిస్తాన్ పై యుద్ధ సన్నద్ధత కోసం మన పాలకులు అఖిలపక్ష సమావేశం జరిపినారు. దానికి ప్రధాని గైర్హాజరు కావడం గమనార్హం. ఆ […]

More

చిత్రకారుని చిత్రతపస్సును స్వప్నిస్తూ …

చిత్రలేఖనం పట్ల ఆసక్తి వున్నా వాటిని చూడటంలోనూ,శీలావీ వేస్తుంటే గమనించటంలోనూ, ఆయన చిత్రాలు మీద వస్తోన్న ప్రతిస్పందనల్ని ఒడిసి పట్టటంలోనూ మాత్రమే శ్రద్ధ పెట్టాను. వీర్రాజు గారు అక్షర సంపెంగలను రంగుల పేపర్లలో పొందికగా అల్లి పంపిన ప్రేమ పరిమళాలు నన్ను ఆవరించటానికన్నా ముందే, చేతిలో చేయేసి నాతో నడకదారిలో అడుగులో అడుగులు కలపక ముందే లేపాక్షి సుందరులతో చూపుల కౌగలింతల్ని పేపర్ల నిండా చిత్రించారు. _______________ వీర్రాజుగారు రామప్ప నాగకన్యకలను మెడలో చుట్టుకున్నారు. అజంతా, ఎల్లోరా […]

More

ఆఫ్రికన్ ప్రజల గుండె చప్పుడు గూగీ వా థియోంగో

“మన జీవితాలు ఒక యుద్ధభూమి. ఈ యుద్ధ భూమి పైన మానవత్వాన్ని నిర్ధారించడానికి ప్రతిజ్ఞ చేసిన శక్తులు, దానిని నాశనం చేయడానికి నిశ్చయించిన శక్తుల మధ్య నిరంతర యుద్ధం జరుగుతుంది. దాని చుట్టూ రక్షణ గోడను నిర్మించడానికి ప్రయత్నించేవారు, దానిని కూల్చివేయాలని కోరుకునేవారు, దానిని రూపొందించాలని కోరుకునేవారు,దానిని విచ్ఛిన్నం చేయడానికి కట్టుబడిన వారు..మన కళ్ళను తెరవడానికి, మనకు వెలుగును చూపించడానికి, రేపటిని చూడడానికి ప్రయత్నించేవారు, మనలను కళ్ళు మూసుకునేలా నిద్ర పుచ్చి ఊయలలో ఉంచాలని కోరుకునేవారు. ఈ […]

More

మహామనిషి వాక్యం – మహేందర్ కవిత్వం

వర్తమాన కాలంలో అస్తిత్వాన్ని ప్రకటిస్తూ ఆధిపత్యాన్ని ఎదిరించే ప్రముఖ కవి బిల్ల మహేందర్. మనసును హత్తుకుంటాడు. మనిషితనాన్ని ఎత్తుకుంటాడు. మనసును తొలిచే సమాజ స్థితిగతులను చూస్తూ, అక్షరీకరించడమే వారి నైజం. బాధలు లేని గాథలే బిల్ల మహేందర్ కవిత్వ లక్షణాలు.ఈ దేశంలో బలహీనుల మీద బలవంతులు అనబడే పులుల ఆట సాగుతూనే ఉందని బాధపడతాడు. “ఇప్పుడు/ఎవరి నోటి నుండైనా ‘పులి-మేక’ పదం జారి పడ్డప్పుడు /తెలియకుండానే కళ్ళనుండి రక్తం కారుతుంటది” అని విలపిస్తాడు. బిల్ల మహేందర్ ఇప్పటికే […]

More

కాలదోషం పట్టని వస్తుస్పృహే శివకుమార్ కథల బలం

సాహిత్య జీవన షష్టిపూర్తిని జరుపుకున్న శ్రీ పి.వి.ఆర్. శివకుమార్ తెలుగు పత్రికాలోకంలో బహుళ ప్రాచుర్యాన్నీ, అత్యధిక పాఠకాదరణనూ పొందిన ప్రముఖ కథకులు, నవలాకారులు. 72-82 మధ్య, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో అనేక నాటికలు, కథలు, పూలజల్లు వంటి కార్యక్రమాలు, ఈనాడు దినపత్రికలో టూకీగా శీర్షిక, ఆదివారం అనుబంధంలో వ్యాసాలు, మినీ కథలు, సితార వ్యాసాలతో పాటు, సినిమా సమీక్షలు విరివిగా వచ్చాయి. విపులలో యాభై దాకా వివిధ భాషల అనువాద కథలు వచ్చాయి. అలనాటి ఆంధ్రపత్రిక మొదలుకొని, […]

More

సృజన చైతన్యం రెంటాల విమర్శ

విమర్శనా రంగంలో అడుగు పెట్టాలంటే తీవ్రమైన అధ్యయనంతోపాటు, అవగాహన, దృక్పథం, రచనను అంచనా కట్టడం తెలిసి ఉండాలి. సహృదయ విమర్శకుడుగా గుణదోషాలను నిర్ధారించాలి. గత రెండు దశాబ్దాలుగా విమర్శనా రంగంలో మంచి కృషి చేస్తున్న డాక్టర్ రెంటాల శ్రీ వెంకటేశ్వరరావు ‘అవగాహన’ ,’లోపలికి’, ‘ఒలుపు’, ‘వెలుతురు’ అనే నాలుగు సాహిత్య వ్యాసాల సంపుటాలను వెలువరించారు. _______________ ఈ సంపుటులలోని వ్యాసాలలో రెంటాల వారి దృష్టి సునిశితం. పరిశీలన ప్రామాణికం. ఉపరితల వాక్యాలు ఉండవు. తన ముందు విమర్శకులను, […]

More

టెక్నాలజీ విసిరే మాయావలలను హెచ్చరించే నవలిక

Technology is a useful servant but a dangerous master. – Christian Lous Lange ఇప్పుడు మనం కృత్రిమ మేధ ( AI ) ప్రపంచంలో వున్నాం. సమస్త విషయ సమాచారం,విశ్లేషణ, ఊహాచిత్రాల సృష్టి, మానవుడి ప్రశ్నలకు, ఆజ్ఞలకు ప్రతిస్పందన ఈ కృత్రిమమేధ ద్వారానే పొందుతున్నాం. స్వీయ-అవగాహన కలిగిన, కృత్రిమ సూపర్ ఇంటెలిజెన్స్ అనేవి కృత్రిమమేధ యొక్క ఊహాత్మక రూపాలు. ఇవి మానవుల కంటే తెలివైనవిగా ఉంటాయని భావిస్తున్నారు. ఇటువంటి సాంకేతిక యుగంలోకి మనం […]

More

విశిష్టమైన పరిశోధన “దమనకాండ”

“కవులు, కళాకారులు, దళిత వీరవనితలు సమాజాన్ని భౌతికంగా మార్చడమే కాదు, మానసికంగా, సాంస్కృతికంగా మార్చిన అనేక తరంగాలు తరంగాలుగా ఈ పుస్తకంలో వెళుతుంటాయి. మనల్ని ఉద్రేక పరుస్తుంటాయి”(కత్తి పద్మారావు, ముందుమాట, దమనకాండ) ‘దమనకాండ’ తెలుగులో “దళిత సంఘటనాత్మక కవిత్వం’’ అన్నది డా॥ బద్దిపూడి జయరావు పరిశోధన గ్రంథం. ఆచార్య జి.యస్‌. భాస్కరరావు పర్యవేక్షణలో పరిశోధించి, ఈ గ్రంథం ద్వారా ఆయన తెలుగు విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌.డి. పట్టా పొందారు. విశ్వవిద్యాలయాలు ఉత్పత్తి చేసే సిద్ధాంత గ్రంథాలలో పదిశాతం […]

More