సమకాలీన కవిత్వానికి సాధికారిక దిక్సూచి ‘చెమట చెక్కిన వాక్యం’

కవిత్వ నిర్వచనం, దాని నిర్మాణం పట్ల ప్రాచీన లాక్షణికుల నుండి ఆధునిక కవుల వరకు కొత్త కొత్త వ్యూహాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. వస్తువుకి అనుగుణమైన రూపాన్నీ, శిల్పాన్నీ ఎన్నుకోవడంలోనే కవి ప్రతిభ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొంతమంది మంచి వస్తువుని తీసుకున్నా, దాన్ని తగిన శిల్పంలో అభివ్యక్తీకరించలేరు. అలాగే, శిల్పం తెలిసినా వస్తువుని దానికి అనుగుణంగా వాడుకోవడం కూడా తెలియని వాళ్ళున్నారు. శిల్పం కోసమో, ప్రయోగం కోసమో రాసే కవులు వస్తువుని నిర్లక్ష్యం చేస్తారు. వీటిని వచన కవిత్వం […]

More

జలతీగల నాదం మహమూద్ పాషా కవిత్వం

    కొండరాళ్ళని కోమలమైన శిల్పాలుగా మలిచే విద్య తెలిసిన వాళ్ళు కొందరే ఉంటారు. రక్షణ వ్యూహంతో శత్రుదుర్భేద్యమైన కోటను నిర్మించే చాతుర్యం ఉన్నవాళ్ళు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందినవారే మహమూద్ పాషా. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ప్రముఖ కవి దేవిప్రియ గారు మహమూద్ పాషా ‘ఉనికి’ కవితా సంపుటి గురించి రాస్తూ ‘రేపటికవి’గా ప్రకటించారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నలబైయేండ్లుగా తనలోని నిప్పు ఆరిపోకుండా నిరంతరం రాజేసుకుంటూ జ్వాలగా ప్రజ్వరిల్లుతున్న మూడు తరాల […]

More

ఎన్నెన్ని యుద్ధాల ఆనవాళ్ళో ‘అఫ్సర్ కవిత్వం’లో

“కాకరూ సజనీ ఆయే నా బాలమూ” అనే పాట పదేపదే గుర్తొస్తుంది అఫ్సర్ కొత్త కవిత్వం చదువుతున్నప్పుడు- దానికి కొంచెం కొనసాగింపుగా ఈ మాట కూడా అనాలనిపిస్తోంది. అతను రానే రాడని తెలిశాక కూడా అతని పాట నా లోపల నేను రాసుకోలేని ఉత్తరాలను రాసి పెడుతూనే ఉంది. అఫ్సర్ రాసిన అక్షరాల వెంటబడి పోతూ ఉంటే, పాటలై పద్యాలై మనలోకి చొరబడుతూనే ఉంటాయి. ఎక్కడో తెలుసా? ఇదిగో సరికొత్తగా రాసిన “యుద్ధం మధ్యలో నువ్వు” కవితా […]

More

“తపన” ఆధునిక కవిత్వ సంకలనం – ఒక అవలోకన

“The purpose of poetry is to make life complete itself” -Wallace Stevens జీవితానికి ప్రతిబింబం కవిత్వం. జీవితానికి పర్యాయపదం కవిత్వం అని ఎంతోమంది ఎన్నోరకాల వ్యాఖ్యానాలు చేసినా…ఇప్పటివరకు కవిత్వం గురించి పూర్తిగా ఎవ్వరూ నిర్వచించలేదనేది వాస్తవం. ఇప్పటికీ కవిత్వం అంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతిగానో, అనుభవంగానో భావిస్తున్నాం. ఈ “తపన” కవిత్వగేయ సంకలనంలోని కవితల్ని కాదు.. జీవితాల్ని తిరగేస్తే ఇందులోని కవులు ఎంతో లోతైన జీవనానుభవాల్ని తమదైన ప్రత్యేక శైలిలో కవిత్వీకరించారనేది స్పష్టమవుతుంది. […]

More

హృదయాన్ని చలింపజేసే కవిత్వం “చందనాగ్ని”

‘చందనుడు నా హృదయనందనుడు ఇతడు ఇందూరు వాడే కాదు, అందరివాడు’ అని సినారె గారిచే, ‘లిఫ్ట్ ద్వారా కాదు, స్వయంకృషితో ఒక్కోమెట్టు నిర్మించుకొని ఒక స్థాయికి వస్తున్నాడ’ని గుంటూరు శేషేంద్ర శర్మ గారితో ‘చందన్ రావు కవిత్వం ఆర్ధ్రతానుభవాన్ని కలిగిస్తుంద’ని రావూరి భరద్వాజ గారితో, ‘ఇందూరు అనగానే నన్ను బంధించిన ఊరు, ఒకప్పుడు చెరసాలలో ఇప్పుడు చందన హృదయశాలలో’ అని దాశరథి గారిచే కీర్తించబడిన ‘ఇందూరు చందనాగ్ని, వి-అంటే వ్యాఖ్యానం,పి-అంటే పోయెట్రీ, వెరసి వి పి చందనం’ […]

More

అనిశెట్టి రజిత ఇక లేరా!

వరంగల్లు: కవి, గాయకురాలు, ఉద్యమోపజీవి, ఉపన్యాసకురాలు, వ్యాస రచయిత్రి, ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఆవిర్భావ సభ్యురాలు, ప్రస్తుత జాతీయ అధ్యక్షురాలు అనిశెట్టి రజిత వరంగల్లులో నిన్న రాత్రి గం.10.22 లకు (ఆగస్టు 11వ తేదీ) గుండెపోటుతో మరణించారు. హైస్కూల్ విద్యార్థిగా 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది. ఇంటర్ విద్యార్థిగా ప్రగతిశీల మహిళా సంఘం(pow) పిలుపుకు ప్రతిస్పందించింది. సమకాలపు సామాజిక చలనాలకు కదిలిపోతూ కవిత్వమైంది. 1982లో కాకతీయ అధ్యాపక బృందం విద్యార్థులు కలిసి ఏర్పాటు చేసిన స్త్రీజనాభ్యుదయ […]

More

‘ప్రతీరమ్’ ర్యాలీ ప్రసాద్ కవిత్వం పై పరామర్శ

ప్రముఖ కవి ర్యాలీ ప్రసాద్ తెలుగు సాహిత్య లోకంలో, ముఖ్యంగా వచన కవిత్వ రంగంలో సుపరిచితమైన, పరిచయం అవసరం లేని పేరు. ఒక సున్నితమైన కవిగానే కాకుండా, లోతైన సామాజిక దృక్పథం, తాత్విక చింతన కలిగిన రచయితగా పేరుపొందారు. ఇప్పటిదాకా దాదాపు ముప్పై గ్రంథాలపైనే వెలువరించారు. 160 పైగా వివిధ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయి పురస్కారాలు పొందారు.వచన కవిత్వం, దీర్ఘ కవితలతో పాటు కొన్ని ప్రాంతీయ చరిత్రలపై కూడా రచనలు చేశారు. తమస్(మతకల్లోలాల నేపథ్యంలో సాగే […]

More

మానవీయతకు చిరునామా ఆశారాజు కవిత్వం

‘నిరీక్షించడం నా విధేయత రావడం నీ బాధ్యత జీవితమా మర్చిపోకు కవిత్వం నాకు ఒక నమ్మకం’ అంటూ ‘నా విధేయత’ కవిత ద్వారా స్పష్టంగా తన నిర్ణయాన్ని ప్రకటించడమే కాకుండా తు.చ. తప్పకుండా పాటిస్తున్న మానవీయ కవి ఆశారాజు. ఆయన కవిత్వంలో గంభీరమైన పదజాలాలు కనిపించవు. పొడుగు పొడుగు వాక్యాలుండవు. అనవసరమైన ఉపమానాలుండవు. సందర్భానుసారమైన సుస్వరాల కవితాశైలితో ఆకట్టుకొనే కవితా నిర్మాణం ఆయనది. జీవితం పట్ల అమితమైన ప్రేమను చూపించడం మాత్రమే ఆయనకు తెలిసిన మర్మకళ. సామాన్య […]

More

మహామనిషి వాక్యం – మహేందర్ కవిత్వం

వర్తమాన కాలంలో అస్తిత్వాన్ని ప్రకటిస్తూ ఆధిపత్యాన్ని ఎదిరించే ప్రముఖ కవి బిల్ల మహేందర్. మనసును హత్తుకుంటాడు. మనిషితనాన్ని ఎత్తుకుంటాడు. మనసును తొలిచే సమాజ స్థితిగతులను చూస్తూ, అక్షరీకరించడమే వారి నైజం. బాధలు లేని గాథలే బిల్ల మహేందర్ కవిత్వ లక్షణాలు.ఈ దేశంలో బలహీనుల మీద బలవంతులు అనబడే పులుల ఆట సాగుతూనే ఉందని బాధపడతాడు. “ఇప్పుడు/ఎవరి నోటి నుండైనా ‘పులి-మేక’ పదం జారి పడ్డప్పుడు /తెలియకుండానే కళ్ళనుండి రక్తం కారుతుంటది” అని విలపిస్తాడు. బిల్ల మహేందర్ ఇప్పటికే […]

More

పసిపాప నిద్రలోని నవ్వును పలకరించిన కవిత్వం

సాహిత్య ప్రక్రియలలో నిగూఢతను కలిగి, సాధారణంగా నడిచే వాక్యాలకు భిన్నంగా మనసును రంజింపజేయటమే కాకుండా ఆలోచింపజేసే శక్తివంతమైన పదాల మోహరింపునే ‘కవిత’ అంటూ ఒక నిర్వచనం తన గొంతును సవరించుకుంటోంది. కవిత్వం ఒక సృజనాత్మక సాహితీ ప్రక్రియ. కవిత్వం ఒక నిరంతర సాధన. కవిత్వమంటే అక్షర హింస కాదు,అది అక్షర తాండవం. కవిత్వమంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన, ఒక ఆవేశం, ఒక ఆశయం. ఈ సమ్మేళనంలోని తాత్వికతకు హారతుల్లా నిలిచిన అతి కొద్దిమంది కవుల్లో […]

More